Mithali Raj : భారత మహిళల క్రికెట్కు వన్నె తెచ్చిన వాళ్లలో మిథాలీ రాజ్(Mithali Raj) ఒకరు. ఈ మాజీ కెప్టెన్తన అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. వాటిలో డబుల్ సెంచరీ(Double Century) మాత్రం చాలా ప్రత్యేకం. అవును.. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు మిథాలీ చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల వయసున్న ఆమె 2002 ఆగస్టు 17న ఇంగ్లండ్(England)పై డబుల్ సెంచరీ కొట్టి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దాంతో టెస్టు ఫార్మాట్లో ద్విశతకం బాదిన మొదటి భారత మహిళా క్రికెటర్గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
ఆ ఏడాది భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. రెండో టెస్టులో మిడిలార్డర్ చేతులెత్తేయడంతో మిథాలీ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకుంది. ఓపికగా 407 బంతులు ఆడిన ఆమె 19 ఫోర్లతో 214 రన్స్ కొట్టింది. ఝులాన్ గోస్వామి(62)తో కలిసి 157 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో, టీమిండియా 467 పరుగుల చేసింది. ఆ తర్వాత గోస్వామి, నీతూ డేవిడ్ బౌలింగ్లో సత్తా చాటడంతో ఆ టెస్టు డ్రాగా ముగిసింది. తన 23 ఏళ్ల కెరీర్లో 12 టెస్టుల మాత్రమే ఆడిన మిథాలీ 4 అర్ధ శతకాలతో 699 పరుగులు సాధించింది.
మిథాలీ రాజ్
వన్డేల్లో మిథాలీ గొప్పగా రాణించింది. వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాదిన మొదటి క్రికెటర్గా రికార్డు ఆమె పేరిటే ఉంది. అంతేకాదు అత్యధిక ఫిఫ్టీల రికార్డు కూడా మిథాలీదే కావడం విశేషం. 2005లో ఆమె భారత్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించింది. మొత్తంగా 155 మ్యాచుల్లో సారథిగా వ్యవహరించింది. అంతేకాదు రికార్డు స్థాయిలో రెండు వరల్డ్ కప్(2005, 2017)లలో టీమిండియాను నడిపించింది. తన సుదీర్ఘ వన్డే కెరీర్లో మిథాలీ 7,805 రన్స్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మిథాలీ మహిళల ప్రీమియర్ లీగ్(wpl 2023) తొలి సీజన్లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. గుజారాత్ జెయింట్స్(Gujart Giants) జట్టుకు మెంటార్గా మళ్లీ ఫ్యాన్స్ను పలకరించింది.