Bangladesh Cricketers : బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆట కంటే తమ ఫన్నీ ఫీల్డింగ్తో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీలంక(Srilanka)తో జరుగుతున్న రెండో టెస్టులో ఒకే క్యాచ్ను ముగ్గురు జారవిడవడం మరవకముందే.. తాజాగా బంతి కోసం ఐదుగురు పరుగులు పెట్టారు. రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్లో లంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య గల్లీ దిశగా షాట్ కొట్టాడు.
ఆ బంతిని ఆపేందుకు బంగ్లా ఫీల్డర్లు ఒకరివెంట ఒకరు పరుగందుకున్నారు. చివరకు బౌండరీ అయితే ఆపారు. కానీ, ఆలోపే లంక ఆటగాడు రెండు పరుగులు తీశాడు. బంగ్లా ఆటగాళ్లు పరుగులు పెడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినవాళ్లంతా ‘బంగ్లా క్రికెటర్లు మామూలోళ్లు కాదు’ అని కామెంట్లు పెడుతున్నారు.
R̶e̶a̶l̶ ̶l̶i̶f̶e̶ ̶i̶n̶c̶i̶d̶e̶n̶t̶ ̶i̶n̶s̶p̶i̶r̶i̶n̶g̶ ̶a̶ ̶m̶o̶v̶i̶e̶
Movie inspiring a real-life incident 🎥
.
.#BANvSL #FanCode pic.twitter.com/1USI5EH9cV— FanCode (@FanCode) April 1, 2024
తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన లంక రెండో మ్యాచ్లోనూ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 178 పరగులకే కట్టడి చేసిన శ్రీలంక.. మూడో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 102 రన్స్ కొట్టింది. దాంతో, పర్యాటక జట్టు ఆధిక్యం 455 పరుగులకు చేరింది. ఏంజెలో మాథ్యూస్(39), ప్రభాత్ జయసూర్య(3)లు నాలుగో రోజు ఆధిక్యాన్ని 500 దాటిస్తే.. బంగ్లాకు ఇక కష్టకాలమే.