జొహన్నెస్బర్గ్: ఓపెనర్ ఫఖర్ జమాన్ (155 బంతుల్లో 193; 18 ఫోర్లు, 10 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినా.. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. మొదట సఫారీలు 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేశారు. డికాక్ (80), బవుమా (92), డసెన్ (60), మిల్లర్ (50) రాణించారు. అనంతరం ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫఖర్ రికార్డులకెక్కినా.. మిగిలిన వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో జమాన్ రనౌట్గా వెనుదిరగడంతో పాకిస్థాన్ చివరకు 324/9తో నిలిచింది.
ఇవి కూడా చదవండి..