అడిలైడ్: టీ20 వరల్డ్కప్ రెండవ సెమీస్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. అడిలైడ్లో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా ఎటువంటి మార్పులు లేకుండా ఆడనున్నది. గాయంతో ఎటువంటి సమస్య లేదని రోహిత్ తెలిపాడు. జట్టులో ఎటువంటి మార్పు చేయడం లేదన్నాడు. జింబాబ్వేతో ఆడిన జట్టుతోనే సెమీస్లో ఆడుతున్నట్లు రోహిత్ తెలిపాడు. దీంతో ఈ సెమీస్లో పంత్కు బర్త్ కన్ఫర్మ్ అయ్యింది. కీపింగ్ బాధ్యతల్ని పంత్ చేపట్టనున్నాడు.
అడిలైడ్లో ఇప్పటి వరకు 11 టీ20 మ్యాచ్లు జరిగాయి. అయితే అక్కడ టాస్ గెలిచిన జట్టు ఇప్పటి వరకు మ్యాచ్ను గెలవలేదని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లండ్ జట్టులో డేవిడ్ మలన్, మార్క్ వుడ్ స్థానంలో ఫిల్ సాల్ట్, క్రిస్ జోర్డాన్లు వచ్చేశారు.
England have opted to bowl against India in Adelaide 🏏
Who are you rooting for?#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/PgKzpNrdvB pic.twitter.com/nMt7e8Orjr
— ICC (@ICC) November 10, 2022