ప్రముఖ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ తాజాగా భారత్, పాక్ మధ్య జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా భారత్, పాక్ మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2021లో ఈ మ్యాచ్ కోసమే కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. దీనిపై క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
దుబాయ్లోని ఇంటర్నేషన్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఇండియా, పాక్ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ చెలరేగిపోతాడని దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పాడు. మొన్నటి వరకు జరిగిన ఐపీఎల్ 2021 మ్యాచ్లలో శార్దూల్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
శార్దూల్ మంచి ఫామ్లో ఉన్నాడు. పెద్ద పెద్ద ప్లేయర్ల వికెట్లు తీయడంలో శార్దూల్ పెట్టింది పేరు. అందుకే.. ఇటువంటి హైఓల్టేజ్ మ్యాచ్లో ఖచ్చితంగా అటువంటి ప్లేయర్ ఉండాలి. ఐపీఎల్ ఫైనల్లో కూడా శార్దూల్ ముఖ్య పాత్ర పోషించాడు. ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా కీ ప్లేయర్ల వికెట్లను తీసి కోల్కతాను ఓటమి అంచుకు తీసుకెళ్లడంలో శార్దూల్ పాత్ర మరువలేనిది.. అంటూ దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
దినేశ్ కార్తీక్ అంచనా ప్రకారం భారత్, పాక్ మ్యాచ్లో ఆడే టీమిండియా ప్లేయర్స్ వీళ్లే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సుర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లేదా మహ్మద్ షమీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ind vs Pak | ‘రాహుల్ ఈ మ్యాచ్ ఆడకు.. మహీ ఇదొక్కటి వదిలెయ్’.. పాక్ అభిమానుల వేడుకోలు!
Sand Art: నేటి భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై పట్నాయక్ సుందర సైకత శిల్పం
Ind Vs Pak | పాక్పై పరుగులు చేయడం కోహ్లీకి చాలా ఇష్టం.. వెల్లడించిన చిన్ననాటి కోచ్
Ind Vs Pak | గెలవాలంటే భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వండి.. షోయబ్ అక్తర్ సలహా