David Miller : దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను ఓటమితో ఆరంభించిన భారత జట్టు.. సంచలన ఆటతో సిరీస్ను సమం చేసింది. సిరీస్ డిసైడర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(100) విధ్వంసానికి.. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(60) మెరుపు బ్యాటింగ్ తోడవ్వడంతో టీమిండియా 201 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో సఫారీ జట్టు పవర్ ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్ మర్క్రమ్(26), క్లాసెన్(5) వెనుదిరిగాక వచ్చిన డేంజరస్ డేవిడ్ మిల్లర్(35) కూడా ఔటయ్యేవాడే. కానీ అదృష్టం కొద్దీ అతడు బతికిపోయాడు.
అసలేం జరిగిందంటే.. ? రవీంద్ర జడేజా ఓవర్లో మిల్లర్ ఆడిన బంతిని కీపర్ జితేశ్ శర్మ అందుకున్నాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో భారత జట్టు రివ్యూ తీసుకుంది. అయితే.. ఆ సమయంలో సాంకేతిక లోపం కారణంగా డీఆర్ఎస్ పనిచేయలేదు. దాంతో, మిల్లర్ బ్యాఇటింగ్ కొనసాగించాడు. కొద్దిసేపటి తర్వాత డీఆర్ఎస్ పనిచేసింది.
It was clear big edge umpire says “not out” and drs was not working in internation match wow thats amazing @BCCI @ICC pic.twitter.com/M96C6cVVG9
— faisal516 (@faisalanwar516) December 14, 2023
అందులో మిల్లర్ ఔట్ అయినట్టు స్పష్టంగా కనిపించింది. దాంతో, జడేజాతో సహా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసహనం వ్యక్తం చేశారు. చివరకు బర్త్ డే బాయ్ కుల్దీప్ యాదవ్ మిల్లర్ను బౌల్డ్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్ ముగిసింది. 106 పరగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ సమం చేసింది. పొట్టి సిరీస్ ముగియడంతో ఇరుజట్లు వన్డే సమరానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 17న జరిగే తొలి వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.