కొలంబో: మాజీ బ్యాటర్ సనత్ జయసూర్య(Sanath Jayasuriya) మళ్లీ కనిపించనున్నారు. శ్రీలంక క్రికెట్ జట్టుకు అతన్ని ఓ ఏడాది పాటు కన్సల్టెంట్గా నియమించారు. లంక క్రికెట్ బోర్డుకు సంబంధించిన క్రికెటర్లు, కోచ్లను జయసూర్య పరిశీలించనున్నారు. ప్లేయర్లు వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచుకునే రీతిలో అతను సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. కోచింగ్ స్టాఫ్ను కూడా మానిటర్ చేయనున్నారు. జాతీయ క్రికెటర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నాడు.
జయసూర్యపై రెండేళ్ల బ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. 2019లో జరిగిన ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణను జయసూర్య తిరస్కరించారు. అయితే ఆరోపణలు అంగీకరించడంతో ఆయన్ను రెండేళ్లు బ్యాన్ చేశారు. గతంలో రెండుసార్లు శ్రీలంక చీఫ్ సెలెక్టర్గా చేశాడు. రెండు సార్లు వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడతను.