World Cup 2023 : భారత జట్టు మూడో సారి వరల్డ్ కప్ ట్రోఫీ(World Cup)ని ముద్దాడేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. లీగ్ దశలో వరుసపెట్టి ప్రత్యర్థులను మట్టికరిపించిన రోహిత్ సేన.. సెమీస్లోనూ దుమ్మురేపాలని కోట్లాదిమంది అభిమానులు కోరుకుంటున్నారు. భారీ అంచనాలతో సాగే సెమీస్ ఫైట్ను చూసేందుకు విశిష్ట అతిథి రాబోతున్నాడు. అతడెవరో తెలుసా..? ఇంగ్లండ్ మాజీ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్(David Beckham).
యూనిసెఫ్(UNICEF) గుడ్విల్ అంబాసిడర్గా ఉన్న బెక్హమ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు రానున్నాడు. స్వతహాగా ఫుట్బాలర్ అయిన బెక్హమ్కు క్రికెట్ అంటే ఇష్టం. పైగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని బాగా ఫాలో అవుతుంటాడు. బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీస్ పోరును వీక్షించేందుకు బెక్హమ్ ముంబైలోని వాంఖడే స్టేడియానికి రానున్నాడు.
ఇంగ్లండ్ గొప్ప ఫుట్బాలర్లలో ఒకడైన బెక్హమ్ ప్రస్తుతం ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్కు సహ యజమానిగా ఉన్నాడు. ఈ మధ్యే ఈ క్లబ్ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi)ని భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
వన్డే వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో భారత్, కివీస్ హోరాహోరీగా తలపడనున్నాయి. లీగ్ దశలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే… 2019 ఎడిషన్ సెమీస్లో పరాభవానికి ప్రతీకారంగా కివీస్ను ఇంటికి పంపాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ప్రస్తుతం అజేయంగా సెమీస్కు చేరిన టీమిండియా జోరు చూస్తేంటే కివీస్కు మరోసారి భంగపాటు తప్పకపోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.