హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ(BRS)ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. మంగళవారం బేగంపేటలోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతపూర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేశారని పేర్కొన్నారు. ఇన్నేండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రజలు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో BRS ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు.