China Masters: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత్కు నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి. బుధవారం పురుషుల సింగిల్స్లో ముగ్గురు భారత షట్లర్లు పోటీలో ఉండగా ముగ్గురూ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టారు. కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్లు తమ పేలవ ఫామ్ను కొనసాగిస్తూ ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరిగారు.
పురుషుల సింగిల్స్లో భాగంగా ప్రియాన్షు రజావత్..17-21, 14-21 తేడాతో జపాన్కు చెందిన కెంటా నిసిమోటో చేతిలో ఓడిపోయాడు. లక్ష్యసేన్ను 19-21, 18-21 తేడాతో చైనాకే చెందిన షి యు కి ఓడించాడు. ఇక కిదాంబి శ్రీకాంత్.. 15-21, 21-14, 13-21 తేడాతో థాయ్లాండ్కు చెందిన కున్లావత్ వితిద్సరన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్.. తొలి రౌండ్ గండాన్ని దాటిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్లో చిరాగ్-సాత్విక్లు కూడా రెండో రౌండ్కు చేరారు.
Its 9th opening round loss for Srikanth in 17 BWF tournaments this year. https://t.co/BWITOGLnxU
— India_AllSports (@India_AllSports) November 22, 2023
లక్ష్య సేన్ పేలవ ఫామ్..
ఈ ఏడాది లక్ష్య సేన్ వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన జపాన్ మాస్టర్స్లో కొడాయ్ నరకొర చేతిలో ఓడిన అతడు.. ఫ్రెంచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్లలోనే కూడా తొలి రౌండ్ దాటలేకపోయాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ కూడా ఈ ఏడాది గత 9 మేజర్ టోర్నమెంట్స్లో ఒక్కదాంట్లో కూడా క్వార్టర్స్ చేరలేకపోయాడు. పారిస్ ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ భారత షట్లర్ల పేలవ ప్రదర్శన ఆందోళన కలిగిస్తున్నది.
Indian challenge in China Masters at end of 1st round:
Prannoy ✅
Lakshya ❌
Srikanth ❌
Priyanshu ❌
Aakasrhi Kashyap ❌
Satwik/Chirag ✅
Panda sisters ❌ #ChinaMasters2023 https://t.co/KE75Lr4pq3— India_AllSports (@India_AllSports) November 22, 2023