చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా మండల పరిధిలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన వంగ శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య వంగ శ్రీధర్రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.