న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్, టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా ఆస్టేలియాతో టెస్టు సిరీస్ కోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తాను మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన కొన్ని ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. ఆ ఫొటోలకు ‘గెటింగ్ రెడీ ఫర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
కాగా, భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. టెస్టు సిరీస్ల విషయానికి వస్తే భారత జట్టుకు చటేశ్వర్ పుజారా కీలక ఆటగాడు. గత ఏడాది ఐదు టెస్టుల్లో 10 ఇన్నింగ్స్ ఆడిన పుజారా 45.44 సగటుతో 409 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరో హయ్యెస్ట్ రన్ స్కోరర్గా చటేశ్వర్ పుజారా ఉన్నాడు. ఈ ట్రోఫీల్లో ఇప్పటివరకు 20 మ్యాచ్లు, 37 ఇన్నింగ్స్ ఆడిన పుజారా 54.08 సగటుతో 1,893 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 204 పరుగులుగా ఉన్నది. ఈ ట్రోఫీల్లోనేగా ఇతర టెస్టు సిరీస్లలోనూ పుజారా మంచి రికార్డు ఉన్నది.
Getting ready for 🇮🇳 vs 🇦🇺 pic.twitter.com/g8c1RRqUbO
— Cheteshwar Pujara (@cheteshwar1) January 31, 2023