PBKS vs RCB : హిమాలయాల సమీపంలోని ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మాజీ సారథి విరాట్ కోహ్లీ(92) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 55వ హాఫ్ సెంచరీ బాదిన విరాట్ ఆర్సీబీకి కొండంత స్కోర్ అందించాడు. రజత్ పాటిదార్(55)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్(46)తో కలిసి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దాంతో, ధర్మశాలలో రికార్డు స్కోర్ కొట్టిన ఆర్సీబీ ప్రత్యర్థికి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. కోల్కతా నైట్ రైడర్స్పై 262 పరుగుల్ని ఊదిపడేసిన పంజాబ్ హిట్టర్లు మళ్లీ తమ బ్యాట్లకు పని చెప్పితే.. బెంగళూరుకు ఓటమి తప్పకపోవచ్చు.
ఆకాశమంత ఎత్తులో చావోరేవో పోరు.. టాస్ ఓడిన ఆర్సీబీకి ఆదిలోనేపంజాబ్ అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(9)ను ఔట్ చేసిన కవెరప్ప.. తర్వాతి ఓవర్లో డేంజరస్ విల్ జాక్స్(12)ను వెనక్కి పంపాడు. దాంతో, 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు పడ్డాయి.
𝗔𝗲𝗿𝗶𝗮𝗹 𝘀𝗵𝗼𝘄 𝗶𝗻 𝗗𝗵𝗮𝗿𝗮𝗺𝘀𝗮𝗹𝗮 ✈️
Rajat Patidar is smacking them with ease & flare at the moment! 👌💥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/BtCcWmIm8n
— IndianPremierLeague (@IPL) May 9, 2024
ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(55) పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీతో జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న అతడు బెయర్స్టోకు దొరికాడు. దాంతో, 119 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ పడింది. పాటిదర్ బౌండరీల వాన వెలిసినా.. మేఘాలు కుమ్మరించిన వర్షం కారణంగా మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది.
పదో ఓవర్ తర్వాత కోహ్లీ మరింత రెచ్చిపోయాడు. లివింగ్స్టోన్ బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడినా.. సామ్ కరన్, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్ ఓవర్లో భారీషాట్లు ఆడాడు. 33 బంతుల్లో 55వ అర్ధ శతకం బాదిన విరాట్ ఆ తర్వాత గేర్ మార్చాడు. ఎడాపెడా బౌండరీలు కొట్టాడు. అవతలి ఎండ్లోని కామెరూన్ గ్రీన్(46) సైతం బ్యాట్కు పని చెప్పాడు.
Innings Break!#RCB set a mountainous target of 2️⃣4️⃣2️⃣, courtesy of a top batting effort 🎯
Can #PBKS pull off this mammoth chase or will the visitors defend it? 🤔
Scorecard ▶️ https://t.co/49nk5rrUlp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/ggcPKr6bSX
— IndianPremierLeague (@IPL) May 9, 2024
దాంతో, 17వ ఓవర్లకే ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన విరాట్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అర్ష్దీప్ ఓవర్లో విరాట్ కొట్టిన బంతి నేరుగా బౌండరీ వద్ద ఉన్న రస్సో చేతుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్(18) సిక్సర్ల మీద సిక్సర్లు బాదేశాడు. అయితే.. ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్(3/38) మూడు వికెట్లు తీసి ఆర్సీబీ స్కోర్ 250 దాటకుండా చూశాడు.