హుస్నాబాద్, మే 9: దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీతో పాటు ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ వేములవాడకు వచ్చి దేవాలయం అభివృద్ధికి కనీసం నిధులు మంజూరు చేయకపోవడం, అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి దేవాలయాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిన మోదీ వేములవాడను ఎందుకు విస్మరించాడో ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు గుంజుతుంది తప్ప దేవాలయాలను అభివృద్ధి చేయదని విమర్శించారు.
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఒక్క గుడికి, బడికి కూడా నిధులు మంజూరు చేయించలేదన్నారు. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతాడని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమ లు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనంతరం విస్మరించిందన్నారు. సీఎం రేవంత్రెడ్డివన్నీ జూటా మాటలన్నారు. రైతులకు బోనస్ లేదు, సంక్షేమ పథకాల అ మలు చేయకుండా మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్రావు, దేవేందర్రావు, ఎంపీపీ కొక్కుల కీర్తీసురేశ్, మాజీ జడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, మం డలాధ్యక్షుడు పెరుగు నరేందర్రెడ్డి, నాయకులు ఆవుల మహేందర్, గవ్వ వంశీధర్రెడ్డి, తిప్పారపు శ్రీకాంత్, గవ్వ కిషన్రెడ్డి, తడకల రాజిరెడ్డి, కుమారస్వామి, నాయకులు పాల్గొన్నారు.