PBKS vs RCB : ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దంచుతున్నారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(6) తక్కువకే ఔటైనా.. జానీ బెయిర్స్టో(27), రిలే రస్సో(37)లు బౌండరీల మోత మోగించారు. సిరాజ్ బౌలింగ్లో రస్సో ఏకంగా 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 18 పరుగులు పిండుకున్నాడు. వీళ్లిద్దరి జోరుతో పంజాబ్ స్కోర్ 5 ఓవర్లకే 50 దాటింది.
అయితే.. ఫెర్గూసన్ బౌలింగ్లో డూప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్తో బెయిర్స్టో వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి రన్స్ కొట్టింది. సామ్ కన్ సేన విజయానికి ఇంకా 84 బంతుల్లో 167 పరుగులు కావాలి.
9⃣2⃣ Runs
4⃣7⃣ Balls
7⃣ Fours
6⃣ SixesThat was one dazzling knock in beautiful Dharamsala! 🙌 🙌 #TATAIPL | #PBKSvRCB | @RCBTweets | @imVkohli
Relive Virat Kohli’s brilliant innings 🎥 🔽
— IndianPremierLeague (@IPL) May 9, 2024
హిమాలయాల సమీపంలోని ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(92) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 55వ హాఫ్ సెంచరీ బాదిన విరాట్ ఆర్సీబీకి కొండంత స్కోర్ అందించాడు. రజత్ పాటిదార్(55)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్(46)తో కలిసి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన రన్ మెషీన్.. 8 పరుగులతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత దినేశ్ కార్తిక్(18) ధనాధన్ ఆడాడు. దాంతో, ధర్మశాలలో రికార్డు స్కోర్ కొట్టిన ఆర్సీబీ ప్రత్యర్థికి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది.