హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు కవితపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపించిన కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించిన విషయం తెల్సిందే. కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారం బెంచ్మీదకు వచ్చే అవకాశం ఉన్నది.