చెన్నై: ఐపీఎల్లో భాగంగా కాసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ తలపడబోతున్నాయి. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ క్రికెట్ ఫ్యాన్స్కు ఓ పజిల్ విసిరాడు. పైన ఉన్న రెండు ఫొటోలు చూశారు కదా. వీటిని జాఫర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ రోజు మ్యాచ్లో ఈ ఇద్దరు ప్లేయర్సే కీలకంగా మారబోతున్నారు అని అతడు ట్వీట్ చేశాడు. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ తమ మెదళ్లకు పని చెప్పారు.
రెండు ఫొటోల్లో పైన ఉన్నదాంట్లో ఓ వ్యక్తి జిలేబీ చేస్తూ ఉండగా.. కింది ఫొటోలో చేపలు నీటిలో ఎలా శ్వాస తీసుకుంటాయి అని ఉంది. ఈ రెండు క్లూలను బట్టి ఫ్యాన్స్ వాళ్లు ఎవరో ఓ అంచనాకు వచ్చేశారు. ఆఫ్ఘన్ జిలేబీ ఫొటో పెట్టి పరోక్షంగా ఆ ప్లేయర్ రషీద్ ఖాన్ అని జాఫర్ చెప్పాడు. ఇక రెండో ఫొటోను బట్టి ఆ మరో ప్లేయర్ నైట్రైడర్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ అని అభిమానులు అంచనా వేశారు. చేపలు మొప్పల (గిల్స్) ద్వారా శ్వాస తీసుకుంటాయి కదా. అలా ఆ ప్లేయర్ గిల్ అని ఫ్యాన్స్ ఠక్కున చెప్పేశారు. మరి ఇవాళ్టి మ్యాచ్లో ఈ ఇద్దరు ప్లేయర్స్ ఎలా ఆడతారో చూడాలి.