Jasprit Bumrah : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోని అతను ఐపీఎల్ 2023 నుంచి కూడా వైదొలిగాడు. అయితే.. టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రాకు సర్జరీ చేయించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అందుకోసం ఈ స్టార్ పేసర్ను న్యూజిలాండ్కు తరలించనుంది. ఇంగ్లండ్ స్పీడ్స్టర్ జోఫ్రా అర్చర్కు వైద్యం చేసిన రోవన్ షౌటర్ బుమ్రాకు ట్రీట్మెంట్ చేయనున్నట్టు సమాచారం.
అక్లాండ్లో ఉండే రోవన్ గతంలో న్యూజిలాండ్ ఆటగాళ్లకు ట్రీట్మెంట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి బౌలింగ్ కోచ్గా షేన్బాండ్కు అతను వైద్యం చేశాడు. దాంతో, అతని సలహా మేరకు బుమ్రాను ఆక్లాండ్కు తరలించనున్నారు. బీసీసీఐ వైద్య బృందం, జాతీయ క్రికెట్ అకాడమీ మేనేజర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. సర్జరీ అనంతరం బుమ్రా కోలుకునేందుకు 20 నుంచి 24 వారాలు పట్టనుంది. దాంతో, అతను ఐపీఎల్తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది. అయతే.. స్వదేశంలో అక్టోబర్ నెలలో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు బుమ్రా ఫిట్గా అవ్వాలని బీసీసీఐ కోరుకుంటోంది.
పోయిన ఏడాది సెప్టెంబర్లో చివరిగా మైదానంలోకి దిగాడు. నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు ఎన్సీఏలో స్కాన్ తీయిస్తే సమస్య తీవ్రంగా ఉందని తెలిసింది. దాంతో, టీ20 వరల్డ్ కప్లో ఆడలేదు. అయితే.. ఈమధ్యే అతడిని శ్రీలంక వన్డే సిరీస్కు ఎంపిక చేసిన బీసీసీఐ వెంటనే తప్పించింది. ఎందుకంటే..? అతను పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం ఇవ్వాలనుకుంది. అయితే.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ వరకైనా అతను ఫిట్నెస్ సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, బుమ్రాకు ఎన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వలేదు.