టోక్యో : 2032లో జరుగబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 2032 ఒలింపిక్స్ నిర్వహించనున్నట్టు ఐవోసీ బుధవారం ప్రకటించింది. ఐవోసీ తాజా నిర్ణయంతో 32 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా ఒలింపిక్స్కు మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. చివరిసారి సిడ్నీ (2000)లో ఒలింపిక్స్ను నిర్వహించారు. అంతకంటేముందు 1956లో మెల్బోర్న్ నగరంలో అంతర్జాతీయ క్రీడలను జరిపారు.