ట్రినిడాడ్: పేస్ బౌలర్ సిరాజ్(Bowler Siraj) .. వెస్టిండీస్ టూర్ నుంచి స్వదేశం బయలుదేరాడు. ఇవాళ్టి నుంచి విండీస్తో టీమిండియా మూడు వన్డే మ్యాచ్లు ఆడనున్నది. అయితే టెస్టు సిరీస్ను 1-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో తన బౌలింగ్తో కీలక పాత్ర పోషించినా.. సిరాజ్ను మాత్రం వన్డే సిరీస్కు దూరం పెట్టేశారు. కాలి మడిమ నొప్పి వల్ల.. ముందస్తు జాగ్రత్తగా సిరాజ్కు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. మెడికల్ టీమ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బార్బడోస్లో ఇవాళ తొలి వన్డే జరగనున్నది. అయితే సిరాజ్ స్థానంలో ఇంకా ఎవర్ని తీసుకోలేదు.
UPDATE – Mohd. Siraj has been released from Team India’s ODI squad ahead of the three-match series against the West Indies.
The right-arm pacer complained of a sore ankle and as a precautionary measure has been advised rest by the BCCI medical team.
More details here… pic.twitter.com/Fj7V6jIxOk
— BCCI (@BCCI) July 27, 2023
అశ్విన్, రహానే, భరత్, సైనీలతో పాటు సిరాజ్ ఇండియాకు బయలుదేరి వచ్చేశాడు. సిరాజ్ గైర్హాజరులో.. శార్దూల్ సీనియర్ పేస్ బౌలర్ పాత్రను పోషించనున్నారు. ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్, ముఖేశ్ కుమార్ కూడా అందుబాటులో ఉన్నారు. సిరాజ్ స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకునే ఛాన్సు కనిపిస్తోంది. విండీస్తో జరగనున్న టీ20 సిరీస్కు సిరాజ్ను ముందే ఎంపిక చేయలేదు. రెండు టెస్టుల్లో సిరాజ్ ఏడు వికెట్లు తీసుకున్నాడు. మార్చిలో చివరిసారి సిరాజ్ ఆస్ట్రేలియాతో వన్డే ఆడాడు.