England : తొలి టెస్టులో గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్(England)కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధ పడుతున్న లీచ్ రెండో టెస్టులో ఆడడం లేదని గురువారం కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) వెల్లడించాడు. ‘విశాఖపట్టణం టెస్టు సెలెక్షన్కు లీచ్ అందుబాటులో లేడు. గాయం కారణంగా అతడి మోకాలిలో రక్తం గట్టకట్టింది. లీచ్ను వైద్యులు పర్యవేక్షిస్తున్నారని స్టోక్స్ తెలిపాడు.
‘లీచ్ గాయం మరింత పెద్దది కాదని భావిస్తున్నా. త్వరలోనే అతడు మళ్లీ జట్టుతో కలుస్తాడు’ అని స్టోక్స్ తెలిపాడు. లీచ్ స్థానంలో పాకిస్థాన్ మూలాలున్న షోయబ్ బషీర్(Shoaib Bashir) ఆడే చాన్స్ ఉంది. అదే జరిగితే స్ట్ క్లాస్ క్రికెట్లో సంచలన ప్రదర్శన చేసిన బషీర్ వైజాగ్ టెస్టులో డెబ్యూట్ చేస్తాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా లీచ్ గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్లో అతికష్టంగా క్రీజులోకి వచ్చాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కేవలం రెండు వికెట్లు తీశాడంతే.
With Jack Leach set to miss the second Test with a bruised knee, who should come into England’s XI? 🤔https://t.co/tCVmNS2fSS | #INDvENG pic.twitter.com/3PQ7YyImov
— ESPNcricinfo (@ESPNcricinfo) January 31, 2024
తొలి టెస్టుల్ స్పిన్ అస్త్రంతో భారత్ను దెబ్బకొట్టిన ఇంగ్లండ్ వైజాగ్ టెస్టులో అదే చేయనుంది. నలుగురు స్పిన్నర్లతో ఆడతామని ఆ జట్టు హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullam) ఇప్పటికే స్పష్టం చేశాడు. తొలి టెస్టు హీరో టామ్ హర్ట్లే, రెహాన్ అహ్మద్తో పాటు షోయబ్ బషీర్లతో కూడిన స్పెషలిస్ట్ స్పిన్ బృందం భారత బ్యాటర్లకు సవాల్ విసరనుంది.
షోయబ్ బషీర్
తొలి టెస్టులో చెలరేగిన పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా టీమిండియాను ఇరుకున పెట్టే చాన్స్ ఉంది. మరోవైపు భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు దూరం కావడంతో తుది జట్టులో ఎవరిని ఆడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మూడో స్థానంలో రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.