హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు ఆడిట్ నివేదికలను గవర్నర్తోపాటు ప్రభుత్వానికి బుధవారం అందజేసినట్టు అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) తెలంగాణ ప్రకటించింది.
ఇందులో 2022 మార్చి 21తో ముగిసిన సంవత్సరానికి రెవెన్యూ సెక్టార్పై రూపొందించిన ఆడిట్ నివేదికతోపాటు 2023 మార్చి 31లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, పద్దులు, బడ్జెట్ ప్రక్రియలపై ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనల నివేదికను సమర్పించినట్టు ఏజీ ఆఫీస్ అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టేలా నివేదికలు రూపొందించినట్టు పేర్కొన్నారు.