ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేటలో అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి (Bear) మరణించింది. పెంచికల్పేటలోని అగర్గూడ సమీపంలోని అడవుల్లో తీవ్ర గాయాలతో ఎలుగు కలేబరం లభించింది. దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు.
వేటగాళ్ల వల్ల విషప్రయోగం వల్ల చనిపోయిందా లేదా విద్యుదాఘాతంతోనా అనేవిషయాలపై దృష్టి సారించామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ వెల్లడించారు. అది ఎవరిపైనానా దాడిచేసినప్పుడు చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. దాని మృతదేహంపై వివిధ భాగాల్లో గాయాలున్నాయని చెప్పారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.