తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం స్వామివారు చిన శేషవాహనంపై (China Sesha Vahanam) ఊరేగారు. అనంతరం అనంతరం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. గురువారం రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్న జీయర్ స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకోగా 41,927 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించిన కానుకల వల్ల హుండీకి 3.63 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.