హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం ఫలితాలను వెల్లడించారు. మొత్తం 1.42 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 1.24లక్షల మంది అభ్యర్థులు (87.61%)ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ఇందులో 50,170 మంది బాలికలు (89.81% ) , 73,720 మంది బాలురు (86.61%) పాసయ్యారని వివరించారు. ఏప్రిల్ 27న నిర్వహించిన పాలిసెట్లో పొందిన మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.