Dharani | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ధరణి కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్తో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిషారంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. ధరణిలో దాదాపు 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. వాటి పరిషారానికి ఈ ఏడాది మార్చిలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేకంగా కమిటీలు వేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించింది.
ఇంతలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్ను నిలిపివేసింది. అప్పటివరకు దాదాపు లక్ష దరఖాస్తులకు సంబంధించిన పరిషార ప్రతిపాదనలు సిద్ధమైనట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో దరఖాస్తుల పరిషారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ధరణి కమిటీ సూచించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్రెడ్డి శనివారం ధరణి కమిటీతో భేటీ కావాలని భావించారు. కానీ, క్యాబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో ఆ సమావేశం జరగలేదని తెలిసింది. దీంతో కమిటీ సభ్యులు సీసీఎల్ఏతో సమావేశమై చర్చించినట్టు సమాచారం. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై జూన్ 4 వరకు ముందుకెళ్లే అవకాశం లేదని ఈ భేటీలో అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
పెండింగ్ దరఖాస్తుల పరిషారాన్ని రాజకీయంగా వాడుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తున్నదన్న విమర్శలున్నాయి. ధరణిలో దరఖాస్తుల పరిషారం నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియను నిలిపివేసింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో హడావిడి మొదలుపెట్టింది. పోర్టల్లో సరైన మార్పులు చేయకుండానే.. తాసీల్దార్లు, ఆర్టీవోలకు అధికారాలు కట్టబెట్టినట్టు ప్రచారం చేసింది.
ఆ తర్వాత కొన్ని రోజులకే ఎన్నికల కోడ్ పేరుతో స్పెషల్ డ్రైవ్ను నిలిపేసింది. అప్పటివరకు ఒక దరఖాస్తుకు కూడా మోక్షం లభించలేదు. దీంతో ధరణిలో దాదాపు 56 నెలలుగా పెండింగ్ దరఖాస్తుల పరిషార ప్రక్రియ ఆగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. దరఖాస్తులను పరిషరించ లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన రేవంత్ సర్కారు కూడా ఇప్పుడు అదేపని చేస్తున్నదని, ధరణి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ తమను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.