హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): 1950-2015 మధ్య దేశంలో హిందువుల జనాభా 84.68 శాతం నుంచి 78.06 శాతానికి తగ్గగా, ఇదే సమయంలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది. ఈ మేరకు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక నివేదికలో వెల్లడించింది.
అయితే, ఎన్నికల సమయంలో బీజేపీ సర్కారు ఇలాంటి నివేదికలను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల ఓటు బ్యాంకు కోసమే మోదీ సర్కారు ఇలా చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.