ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. మరో మూడు రోజుల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగియనున్నాయి. భారత జట్టు సెమీస్ చేరడంతో అభిమానులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ(BCCI) అభిమానులకు శుభవార్త చెప్పింది. నాకౌట్ మ్యాచ్లైన సెమీఫైనల్స్, ఫైనల్ టికెట్లను గురవారం రాత్రి 8ః30 గంటల నుంచి అమ్ముతామని వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ https://tickets.cricketworldcup.com లో టికెట్లు అందుబాటులో ఉంటాయని బీసీసీఐ తెలిపింది.
🚨 NEWS 🚨
Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫
Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm
— BCCI (@BCCI) November 9, 2023
ప్రపంచ కప్లో భారత్ జట్టు ఏకంగా ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లో గెలుపొంది సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఫేవరేట్లుగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాయి. చివరిదైన నాలుగో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి సెమీఫైనల్, నవంబర్ 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో రెండో సెమీఫైనల్ జరుగనుండగా.. నవంబర్ 19న అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈసారి ఫైనల్తో పాటు సెమీఫైనల్ మ్యాచ్లకు కూడా రిజర్వ్ డేను కేటాయించిన విషయం తెలిసిందే.