యమునా నగర్: హర్యానాలోని యుమునా నగర్ (Yamuna Nagar) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కల్తీ మద్యం తాగి (Alcohol) ఆరుగురు యువకులు మరణించారు. యమునా నగర్లోని మందేబరి ప్రాంతంలో మద్యం తాగిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా వారు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పలువురు నిందితులను గుర్తించామని, వారిలో కొందరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ గంగా రామ్ పునియా (SP Ganga Ram Punia)చెప్పారు.
కాగా, మద్యం సేవించినవారిలో ఐదుగురు గ్రామంలోనే మరణించారని ఎస్పీ తెలిపారు. మరొకరు దవాఖానలో మృతిచెందారని, ఇంకో వ్యక్తి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని ఆధారాలను సేకరించామన్నారు.
#WATCH | Yamuna Nagar, Haryana: 6 people died after allegedly consuming spurious liquor in Haryana’s Yamunanagar
SP Ganga Ram Punia says, “In the afternoon, we received the information that a youth had died after consuming alcohol. After this information, the team reached there… pic.twitter.com/sPMMxl8cOF— ANI (@ANI) November 9, 2023