BCCI : ధర్మశాల టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు(Team India)కు బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) గుడ్ న్యూస్ చెప్పాడు. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇకపై టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లకు రూ.45 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్టు షా తెలిపాడు. ఐడీఎఫ్సీ సిరీస్ బహూకరణ సమయంలో జై షా మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్(Test Cricket Incentive Scheme) గురించి వెల్లడించాడు.
‘టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన క్రికెటర్ల ఆర్థిక పురోగతి కోసం ఈ స్కీమ్ తెస్తున్నాం. 2022-23 సీజన్ నుంచి ఈ స్కీమ్ అమలులోకి రానుంది. ఈ స్కీమ్ కింద టెస్టు క్రికెటర్లకు అదనపు ఆదాయం సమకూరనుందని చెప్పాడు.
I am pleased to announce the initiation of the ‘Test Cricket Incentive Scheme’ for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the ‘Test Cricket Incentive Scheme’ will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk
— Jay Shah (@JayShah) March 9, 2024
ఒక సీజన్లో 50 శాతం మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు రూ.35 లక్షలు, 75 శాతం మ్యాచ్లు ఆడినవాళ్లకు రూ.45 లక్షలు ముట్టజెప్పనుంది. బెంచ్ మీదే ఉండే వాళ్లకు రూ.15 లక్షల నుంచి రూ.22.5 లక్షలు చెల్లిస్తామ’ని బీసీసీఐ సెక్రటరీ తెలిపాడు.ఈ మధ్య కాలంలో సదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు యువ క్రికెటర్లు ఆసక్తి చూపడం లేదు.
సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్
సీనియర్ జట్టులో రావడానికి ముందు రంజీల్లో ఆడడం తప్పనిసరి అని చెప్పినా సరే.. ఇషాన్ కిషన్(Ishan Kishan)తో పాటు శ్రేయస్ అయ్యర్లు పెడచెవిన పెట్టారు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్లో అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్(Dhruv Jurel), సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)లు అదరగొట్టారు. అందుకని జురెల్, సర్ఫరాజ్ వంటి ఎందరో యువ ఆటగాళ్లను ప్రోత్సహిచేందుకు మ్యాచ్ ఫీజు పెంచడమే మార్గమని బీసీసీఐ నిర్ణయానికి వచ్చింది.