IND vs ENG 5th Test : ధర్మశాల టెస్టులో భారత జట్టు(Team India) విజయ ఢంకా మోగించింది. నామమాత్రమైన టెస్టులో ఇంగ్లండ్ను చావు దెబ్బకొట్టి అద్భుత విజయం సాధించింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్(Ashwin) 9 వికెట్లు పడగొట్టడడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. అశ్విన్ స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్ ఆటగాళ్లు విలవిలలాడగా.. జో రూట్(84) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
కానీ, మరో ఎండ్లో వికెట్లు తీస్తూ పర్యాటక జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. కుల్దీప్ యాదవ్ ఓవర్లో రూట్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద బుమ్రాకు దొరికాడు. దాంతో, ఇగ్లండ్ 195 పరుగులకు కుప్పకూలింది. వరుసగా నాలుగో విజయంతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, యశస్వీ జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్నారు.
A victory by an innings and 64 runs 👏👏
What a way to end the Test series 🙌
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/uytfQ6ISpQ
— BCCI (@BCCI) March 9, 2024
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లండ్ ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ ఓపెనర్లు బెన్ డకెట్(0), జాక్ క్రాలే(2), ఓలీ పోప్(19)లను ఔట్ చేసి స్టోక్స్ సేనను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన బెయిర్స్టో(39) హడలెత్తించినా కుల్దీప్ అతడిని ఎల్బీగా వెనక్కి పంపాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రూట్(84) ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోర్ 150 దాటించాడు.
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
— BCCI (@BCCI) March 9, 2024
ధర్మశాలలో భారత టాపార్డర్ (Top Order) దుమ్మురేపింది. ఏకంగా ఐదుగురికి ఐదుగురు హాఫ్ సెంచరీపైనే స్కోర్ చేశారు. యశస్వీ జైస్వాల్(57), రోహిత్ శర్మ(103), శుభ్మన్ గిల్(110), దేవ్దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56)లు ఫిఫ్టీలు బాదారు. భారత క్రికెట్ చరిత్రలో టాపార్డర్ ఈ రేంజ్లో ఆడడం ఇది నాలుగోసారి.
రోహిత్ శర్మ(103), శుభ్మన్ గిల్(110)
ఈ మ్యాచ్లో కుల్దీప్ను ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్లో చేరాడు. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నామమాత్రమైన టెస్టులో స్టోక్స్ సేన ఆది నుంచి తడబడింది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ విజృంభణతో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలే 79 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించింది.