అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) లో నలుగురు మృతిచెందారు. జాతరకు వెళ్తున్న యువకుల బైకులు ఒకదానికొకటి ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. న్ని రాత్రిన నందివలసలో శివరాత్రి జాతరకు(Shivaratri Jatara) యువకులు వెళ్తుండగా అరకులోయ మండలం మాదాల పంచాయతీ దమ్ముగుడి వద్ద అదుపుతప్పి ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
బైకుపై ఉన్న నలుగురు తీవ్రగాయాలతో చనిపోగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు