Edupayala Jathara | మెదక్ : ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గ భవాని అమ్మవారిని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, తన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి, చైర్మన్ బాల గౌడ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీవో యాదయ్య తాసిల్దార్ లక్ష్మణ్ బాబుతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.