గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్
మహబూబాబాద్, జూన్ 30: పల్లెల సమగ్రాభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్లో పల్లె, పట్టణప్రగతి సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన 60 లక్షల మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్, హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు తదితరులు పాల్గొన్నారు.