కరీంనగర్ : మరో రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు(Parliament eletions) జరగనున్న తరుణంలో కరీంనగర్లో బీజేపీకి(BJP) బిగ్ షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వైఖరిని నచ్చని పలువురు నాయకులు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. కరీంనగర్ 46వ డివిజన్కు చెందిన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నేత బోయినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గంగుల గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ నేత అక్కనపల్లి రాజుతో పాటుగా పెద్ద ఎత్తున యువకులు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు తిరుపతినాయక్, మైకెల్ శ్రీను, పబ్బతి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.