తిరుపతి : ఉత్తరాఖండ్ (Uttarakhand ) రాష్ట్రంలోని రిషికేష్లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 20సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తామని వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,508 మంది భక్తులు దర్శించుకోగా 25,996 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.