న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీహార్ జైలు నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్కు ఆయన భార్య సునీత, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.
కాగా, మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం సుమారు 50 రోజులు తీహార్ జైలులో ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. బెయిల్ సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లవద్దని, ఎలాంటి ఫైల్స్పై సంతకాలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించిగానీ, ఆ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణల గురించిగానీ కేజ్రీవాల్ ఎలాంటి ఆరోపణలు చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులను కలవకూడదని, వారితో మాట్లాడకూడదని చెప్పింది. జూన్ 2న జైల్లో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.
#WATCH | Delhi CM Arvind Kejriwal released from Delhi's Tihar Jail after being granted interim bail in Delhi excise policy case
The Supreme Court granted him interim bail till June 1. pic.twitter.com/Qw80ugnehO
— ANI (@ANI) May 10, 2024