ముంబై: టీమిండియా టెస్ట్ జట్టు వైస్కెప్టెన్ అజింక్య రహానే కరోనా టీకా తీసుకున్నాడు. తన సతీమణి రాధికతో కలిసి ముంబైలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నాడు. ‘నేను, నా భార్య రాధిక ధోపవ్కర్ ఇవాళ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాం. మేము కేవలం మా కోసమే కాకుండా, మా చుట్టు ఉన్నవారి కోసం టీకా వేయించుకున్నాం. అర్హులైన ప్రతిఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీకోవాలని కోరుతున్నాను’ అని ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు.
ఈ వారం ప్రారంభంలో టీమిడియా ఓపెనెర్ శిఖర్ ధావన్ కూడా కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, అది కరోనా జయించడానికి సహాయపడుతుందని కోరాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు భాతర జట్టులోనే కాకుండా ఐపీఎల్ ఢిల్లీ జట్టులో సభ్యులు కావడం విశేషం.
Got my first dose of the vaccine today. I urge everyone to register and get yourself vaccinated, if you’re eligible pic.twitter.com/VH2xYcTQ1i
— Ajinkya Rahane (@ajinkyarahane88) May 8, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి