సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 50 కి పైగా ఫిర్యాదులు రాగా అందులో భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం వచ్చాయి.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఫిర్యాదులను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.