రామాయంపేట/ చిలిపిచెడ్/ టేక్మాల్, మే 21 : ఈ నెల 23 (సోమవారం) నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రామాయంపేట మండల విద్యాధికారి నీలకంఠం, పరీ క్షల సూపరింటెండెంట్ అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించి, ఏర్పాట్ల ను పరిశీలించారు. పరీక్షలు రాసే విద్యార్థ్ధులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని.. ప్రశాంతంగా రాయాలని సూచించారు. రామాయంపేట 4, నిజాంపేట మండలంలో 1, మొత్తం 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజాంపేట మండలకేంద్రం తోపాటు, రామాయంపేటలోని వివేకానంద, మంజీరా, గురుకుల పాఠశాల, కోనాపూర్, అక్కన్నపేటలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ హాల్టికెట్లను హెచ్ఎంలు అందజేశారు. ఉమ్మడి మండలంలో మొత్తం 25 పాఠశాలల నుంచి 1060 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎంఈవో తెలిపారు. విద్యార్థులు స్వేచ్ఛ గా పరీక్షలు రాసుకోవచ్చని పేర్కొన్నారు.
– పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్
చిలిపిచెడ్ మండల పరిధిలోని 6 ఉన్నత పాఠశాలలు, ఒకటి కస్తూర్బాగాంధీ పాఠశాలలు ఉన్నాయి. చిలిపిచెడ్ మం డల కేంద్రంతోపాటు చండూర్, గౌతాపూర్, సోమక్కపేట, ఫైజాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 139 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. చిట్కుల్లోని కస్తూర్బాగాంధీ, గిరిజన పాఠశాలల వి ద్యార్థులు కొల్చారం మండలంలోని రంగంపేట ఉన్న త పాఠశాల పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రం వద్ద ఉం డాలని, ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకురావొద్దన్నారు.
బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణం: మెదక్ ఆర్టీసీ డిపో డీఎం ప్రణీత్కుమార్
పదో తరగతి పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు ఈ నెల 23 నుంచి జూన్1 వరకు పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రణీత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పనిసరిగా హాల్టికెట్ను కండక్టర్కు చూపించి ఉచితంగా పరీక్ష కేంద్రానికి ప్రయాణించాలన్నారు. వివరాలకు 9959226268, 7382829623, 9347338350, 7382830420, 82 47633867 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.