ప్రశాంత్నగర్,జూన్ 21: రేపటితరాన్ని రక్షించుకోవడానికి యోగా విద్య అద్భుత సాధనమని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ చెప్పారు. సిద్దిపేట జిల్లా అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కోమటి చెరువుపై సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంచుకొస్తున్న అనారోగ్య సంక్షోభాలను ధీటుగా ఎదుర్కొనేందుకు మానసిక, శారీరక దృఢత్వం అనివార్యమన్నారు. దీనికి యోగా విద్య అద్భుత సాధనమన్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యోగా విద్యను ప్రవేశపెట్టామని, ఇక ముందు మరింత పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు చేపడుతామన్నారు. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా లేనప్పుడు వాటికి విలువ ఉండదన్నారు. కరోనా సమాజాన్ని విధ్వంసం చేసిందన్నారు. దీన్నించి గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ భారతీయ ప్రాచీన యోగా విజ్ఞానం ఇప్పుడు మానవ మనుగడకు అనివార్యం అన్నారు. రేపటి తరాన్ని రక్షించుకోవడానికి అన్ని వర్గాల వారు యోగా విద్యను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యుడు అంజయ్య మాట్లాడుతూ యోగా సాధన ఆరోగ్య రక్షణకు అనివార్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధికారి నాగేందర్, నెహ్రూ యువకేంద్ర ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బిన్సీ, సిద్దిపేట జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరమేశ్వర్, సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు తోటఅశోక్, శ్రీనివాస్, డాక్టర్ అరవింద్, యోగా శిక్షకులు తోట సతీష్ పాల్గొన్నారు.
పతాంజలి యోగా ట్రస్టు ఆధ్వర్యంలో…
సిద్దిపేట టౌన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శిక్షకులు మనోహర్ అన్నారు. పతాంజలి యోగా ట్రస్టు, భారత్ స్వామిభాన్, నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. శిక్షకులు మనోహర్ చిన్నారులకు, పెద్దలచే యోగా ఆసనాలు వేయించారు.
మద్దూరు మండలంలో…
మద్దూరు, జూన్21: మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మద్దూరులో నెహ్రూ యువకేంద్రం వలంటీర్ చిలుక రమేశ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులు, యువకులు వివిధ రకాలైన యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ పీడీ దామెర ప్రేమ్కుమార్, కోఆప్షన్ సభ్యుడు ఫసీఅహ్మద్, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గురువులకు సన్మానం
సిద్దిపేట కమాన్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రామరాజు ట్రస్టు భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులను సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అయిత రత్నాకర్, వాసవీ క్లబ్ బాధ్యులు మాంకాల నవీన్, పీఆర్వో వీరేశం, వాణి తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్లో…
గజ్వేల్,జూన్21: గజ్వేల్ పట్టణంలోని ఎడ్యుకేషన్ హబ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండు కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కళాశాలల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, ఉమాశశిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను నేర్చుకుని నిత్యం అభ్యాసం చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాలల సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ మినీ స్టేడియంలో…
హుస్నాబాద్, జూన్ 21: యోగాను నిత్యసాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సీఐ రఘుపతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్లోని మినీ స్టేడియంలో టెన్నిస్ క్రీడాకారులతో కలిసి ఆసనాలు, సూర్యనమస్కారాలు, ధ్యానం చేశారు. కార్యక్రమంలో ఎస్సై సజ్జనపు శ్రీధర్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు బూట్ల రాజమల్లయ్య, సత్యనారాయణరెడ్డి, బూట్ల జయసూర్య పాల్గొన్నారు.
తొగుటలో
తొగుట, జూన్ 21: తొగుటలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పరమేశ్ ఆధ్వర్యంలో యువకులు యోగా కార్యక్ర మంలో పాల్గొన్నారు.
‘సఖి’ కేంద్రంలో
సిద్దిపేట కమాన్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినో త్సవం సిద్దిపేట సఖి కేంద్రంలో జరిగింది. కార్యక్రమా నికి సపోర్టు ఏజెన్సీగా నిర్వహిస్తున్న ప్రగతి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ స్వరూపారాణి పాల్గొ న్నారు. సఖి సిబ్బందికి యోగా ఆసనాలను, బ్రేన్ ఎక్సర్సైజ్, ధ్యానం తదితర ఆసనాలు నేర్పించారు. కార్యక్రమంలో సఖి సిబ్బంది పాల్గొన్నారు.