మిరుదొడ్డి, మే 21 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలు ఆకుపచ్చగా మారాలని డీపీవో గోపాల్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ధర్మారం గ్రామంలో పర్యటించి హరితహార మొక్కలకు నీరు పోశారు. గ్రామంలో నూతనంగా ఎన్ని మొక్కలు నాటారని? కార్యదర్శి మేఘనను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోవద్దన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదయం వేళలో మొక్కలకు నీరు పట్టాలని సూచించారు. మొక్కలకు నీరు పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజిరెడ్డి, సర్పంచ్ గూళ్ల పుష్పాబాగులు, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, ఈజీఎస్ అధికారులు ఉన్నారు.
భావి తరాలకు జలవనరులను అందజేయాలి..
నీటిని పొదుపుగా వాడుకొని, భావితరాలకు జలవనరులను అందించాల్సిన బాధ్యత అం దరిపై ఉందని సర్పంచ్ల ఫోరం మండల గౌరవాధ్యక్షుడు ముత్యాల సంజీవరెడ్డి అన్నారు. ‘వాటరింగ్ డే’ పురస్కరించుకొని ప్రత్యేకంగా హరితహారం నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. నీటిని వృథా చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంతారావు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
కంటికి రెప్పలా మొక్కలను కాపాడాలి
ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని అధికారులకు ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్ సూచించారు. మండలంలోని లద్నూర్, వంగపల్లి గ్రామా ల్లో ‘వాటరింగ్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా మొక్కలకు నీళ్లందించేందుకు ప్రతి గ్రామపంచాయతీకి వాటర్ ట్యాంకర్ మంజూరు చేసిందన్నారు. వేసవీలోనూ మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ నీరందించాలని, మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందుగా గ్రామాల్లోని పల్లె ప్రకృతివనం, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీవో పరశురాములు, సర్పంచ్లు జీడికంటి సుదర్శన్, గంగి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు ‘వాటర్ డే’లో పాల్గొనాలి
ప్రజాప్రతినిధులు ‘వాటర్ డే’లో పాల్గొనాలని ఎంపీపీ తలారి కీర్తన పిలుపునిచ్చారు. మర్రిముచ్చాలలో సర్పంచ్ పద్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మంలో ఎంపీపీ మాట్లాడారు. వాటర్ డే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని, వారానికి రెండుసార్లు మొక్కలకు నీరు పోయాలని సూచించారు. అదేవిధంగా రసూలాబాద్లో సర్పంచ్ పచ్చిమండ్ల స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ‘వాటరింగ్ డే’ నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలి..
హరితహారంలో నాటిన ప్రతి మొ క్కనూ కాపాడాలని సర్పంచ్ గడ్డమీది భాగ్య అన్నారు. మం డల పరిధిలో తిర్మలాపూర్, ఇందుప్రియల్ గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు పోశామని తెలిపారు. మొక్కలను సంరక్షించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
మొక్కలకు నీళ్లు పట్టిన సర్పంచ్
మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో డం పింగ్ యార్డు వద్ద, నర్సరీలో మొక్కలకు సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి నీళ్లు పట్టారు. మొక్కలను చనిపోకుండా చూడాలని కూలీలను కోరారు. నకిరకొమ్ముల లో సర్పంచ్ వెల్దండి సతీశ్ మొక్కలకు నీళ్లు పట్టారు. కార్యక్రమంలో నేతలు తోట ఆంజనేయులు, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
ప్రతి మొక్కనూ కాపాడాలి : ఎంపీవో
హరితహారంలో నాటిన ప్రతి మొ క్కనూ కాపాడాలని అధికారులకు ఎంపీవో సుధీర్కుమార్ సూచించారు. మండల కేంద్రంలో సర్పంచ్ దీపికావేణుగోపాల్రెడ్డితో కలిసి ‘వాటరింగ్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా ధూళిమిట్టలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిత, ఉపసర్పంచ్ పోతరాజు మధు పాల్గొన్నారు.