గజ్వేల్అర్బన్, ఏప్రిల్ 9: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మరింత అభివృద్ధి చేసుకుందామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని ఫంక్షన్ హాలులో మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ బడ్జెట్ను చదివి అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో పాటు పాలకవర్గానికి వివరించారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ బడ్జెట్లో నిధుల కేటాయింపు గురించి, పన్నుల వసూళ్లు, తదితర ఆదాయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ఆదాయం వచ్చినప్పుడే మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు సమకూరుతాయన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీది రూ. రూ.36,55,664ల మిగులు బడ్జెట్ శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలో రూ. 3,55, 58,664ల ప్రారంభ నిల్వ ఉండగా 2021-22 సంవత్సరంలో పన్నుల ద్వారా రూ.6,73,38000, ఇతర ఆదా య పన్నుల ద్వారా 6,44,42,000ల ఆదాయం లభిస్తున్నది. నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా అంచనా ఆదాయం రూ.5,27,52,000లు, ప్లాన్ గ్రాంట్ అంచనా ఆదాయం రూ.2,00,00,000లు, ఇతర గ్రాంట్ల ద్వారా ఆదాయం రూ.1,53,00,000లు వస్తున్నదని కమిషనర్ వెంకటగోపాల్ తెలిపారు.2021-22 సంవత్సరం అంచ నా వ్యయం 25,17,35, 000లుగా లెక్కించడం జరిగిందని, ఈ బడ్జెట్లో అన్ని ఖర్చులు పోనూ రూ.36,55, 664లు మిగులుతాయని అంచనా వేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా+పెట్రో రేట్లు.. టూ వీలర్స్ సేల్స్ డౌన్..