సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్ 2 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పల్లెలను అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు అభివృద్ధికి నిధులు ఖర్చు చే సేలా నిర్ణయించారు. ఈ క్రమంలో పల్లెల అభివృద్ధికి ప్రధానంగా నిధుల సే కరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ సిద్దిపేట జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఇప్పటివరకు 97.42శాతం పన్నులు వసూలు చేశారు. మొత్తం లక్ష్యం రూ. 11.63 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.11.33 కోట్లు వసూలు చేయడం విశేషం.. అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల చొరవతో జిల్లా పన్నులు వసూలులో ఆదర్శంగా నిలించింది. ప న్నుల చెల్లింపు అనే అంశం ఆ గ్రామస్తుల క్రమశిక్షణను సంబంధించింది. త్వరగా పన్నులు చెల్లిస్తేనే, ఆ నిధులతో ఆ పల్లె సమగ్రాభివృద్ధి చెందుతుంది. జిల్లాలో మొత్తం 499 గ్రామ పంచాయతీల్లో 421 గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు కావడం మరో విశేషం.
స్పెషల్ డ్రైవ్.. ప్రత్యేక కార్యాచరణ
గ్రామీణ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడమంటే కత్తిమీద సాము లాంటిందే.. పన్నులపై అవగాహన లోపంతో చెల్లింపునకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తుండంతో పంచాయతీలు అనుకున్న లక్ష్యం చేరేందుకు డీపీవో నేతృత్వంతో పన్నుల వసూలుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మొదట పెండింగ్ పన్నులు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి వసూళ్లపై శ్రద్ధ వహించారు. ప్రత్యేక కార్యాచరణను గ్రామాల్లో పక్కాగా అమలు చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించా, పన్ను చెల్లింపులపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. పన్ను చెల్లించకుంటే ప్రభుత్వ నిబంధన ప్రకారం తీసుకునే చర్యలను వివరించారు. ఇంటి పన్ను, కుళాయి తదితర పన్నులను అధికారులు ఇంటింటికీ వెళ్లి వసూలు చేశారు. దీంతో అనుకున్న లక్ష్యం ఫలప్రదంగా మారింది. జిల్లాలో 97.42 శాతం పన్నులు వసూలు చేశారు.
421 గ్రామాల్లో వందశాతం
499 జీపీలకు గానూ 421 గ్రామాల్లో వందశాతం పన్నులను అధికారులు వసూలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాదిలో అధికారులు పన్నుల వసూలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, లక్ష్యానికి చేరువలో ఉన్నారు. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం రూ. 11.63 కోట్లు ఉండగా, రూ.11.33 కోట్లు పన్నులను అధికారులు వసూలు చేశారు.
నిరంతర సమీక్షలు.. ప్రత్యేక కార్యాచరణ
జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ, అధికారులు కృషితో ఈ సారి పన్నుల వసూలు సులభతరమైంది. వందశాతం వసూలే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగారు. పెండింగ్ బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మరో పక్కా ఉదయం, సాయంత్రం వేళలో ఇంటింటికెళ్లి, పన్నులు వసూలు చేశారు. మండల అధికారుల ఆధ్వర్యంలో వారంతం ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు.
పన్నుల నిధులతో అభివృద్ధికి బాటలు
గ్రామాల్లో పన్నుల నిధులు ఆ పల్లెల అభివృద్ధికి బాటలుగా మారుతాయి. పన్నుల చెల్లింపు అనేది ప్రజల సమిష్టిత్వం, క్రమశిక్షణ సంబంధించిన అంశంగా భావిస్తాను. జిల్లాలో 97.42శాతం మంది క్రమశిక్షణతో గ్రామాలను అభివృద్ధికి చెందేందుకు ఉత్సాహంగా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల కృషితోనే పెద్దమొత్తంలో పన్నుల వసూలు సాధ్యమైంది. బకాయిలపై దృష్టి సారిస్తాం. పన్నుల చెల్లించేందుకు ఆసక్తి చూపని ప్రజలకు అవగాహన కల్పిస్తాం. వారే స్వచ్ఛందంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. పన్నులతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి.
ఇవీ కూడా చదవండి..
1200 ఏళ్ల తర్వాత.. ముందే వచ్చిన వసంతం
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
చరిత్రలో తొలి సాధారణ పౌరుల స్పేస్ఫ్లైట్.. సీట్లన్నీ ఫుల్
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
చిన్నారి ట్వీట్.. ఉలిక్కి పడిన అమెరికా అణ్వాయుధాల సంస్థ