రామాయంపేట, మే 19 : పట్టణంలోని పద్మావతిగోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్య, సత్య నారాయణ, రాఘవ, కమిటీ సభ్యులు కొవ్వూరి లక్ష్మణ్, రవీందర్, సంతోశ్, కిరణ్ తదితరులు ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యే క పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారిని పూలతో అలంకరించి, అభిషేకాలు, పూజలు చేశారు.
భక్తిశ్రద్ధ్దలతో శిఖర, యంత్ర ప్రతిష్ఠాపనోత్సవాలు
వెల్దుర్తి, మే 19 : మండలంలోని బస్వాపూర్లో భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి(మల్లన్నగుట్ట) దేవాలయంలో శిఖర, యంత్ర ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో మొదటి రోజు గణపతిపూజ, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, జలాధివాసము, ఆలయంలోని దేవతామూర్తులకు విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పిల్లికోటాల్ దేవాలయంలో హనుమన్ జయంతి
మెదక్ మున్సిపాలిటీ, మే 14 : ఈ నెల 25న హనుమన్ జయంతి సందర్భంగా పిల్లికోటాల్ హనుమన్ ఆలయంలో పం చామృత అభిషేకం, చందన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు ఆలయ పూజారి ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు సహకరించాలన్నారు.