సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని.. చిన్న పిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీనారాయణుని అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.