మహబూబాబాద్, జూన్ 8 : నాటి కాలంలో లక్ష్మణు డిని బతికించేందుకు అప్పటి చిరంజీవి (హన్మం తుడు) సంజీవిని తీసుకొస్తే…, నేటి చిరంజీవి కరోనా నుంచి ప్రజ లను కాపాడేందుకు ఆక్సిజన్ను తీసుకొచ్చారని మహబూ బాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్తో కలిసి జిల్లా కేంద్రంలోని సూర్య థియేటర్లో కొణిదెల చిరంజీవి, రాంచరణ్ సంయుక్తంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జిల్లాకు అందజేసిన ఆక్సిజన్ బ్యాంక్ను ఎమ్మెల్యే శంకర్నాయక్ మంగళవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రజల మేలు కోసం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అభినంద నీయం అన్నారు. ప్రజలు, అభిమానుల కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసే చిరంజీవి ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్లు అందజేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కరాటే ప్రభాకర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ.ఫరీద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షకార్యదర్శులు గద్దె రవి, గోగుల రాజు, టీఆర్ఎస్ యువత పట్టణ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, సుధగాని మురళి, యాస వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు ఎడ్ల వేణుమాధవ్, బాలునాయక్, విజయమ్మ, దాసరి రావీశ్, కర్పూరపు గోపి, లూనావత్ అశోక్, బూర్ల ప్రభాకర్, మందుల రఘు, చిరంజీవి అభిమాన సంఘం బాధ్యులు మునీర్, గండు కార్తీక్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
మహబూబాబాద్రూరల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉత్తరతండా గ్రామ పంచాయతీ శివారు నేతాజీ తండా లో రూ.10 లక్షల జీపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పను లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు తండాలను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ అంగోత్ కాంతికిషన్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాస వెంకటరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రంజిత్కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధగాని మురళి, తేళ్ల శ్రీను, భూక్యా సురేందర్ నాయక్, సొసైటీ డైరెక్టర్ చాంప్లానాయక్, ఎంపీటీసీ మంగీలాల్, కో ఆప్షన్ షరీఫ్, మల్సూర్నాయక్, వెంకన్న, జనార్దన్, ఎంపీడీవో రవీందర్, సెక్రటరీ స్వప్న పాల్గొన్నారు.