మెదక్ మున్సిపాలిటీ, మే 5 : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లౌక్డౌన్ బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సముదాయ లు మూసివేయడంతో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర సేవలందించే దవాఖానలు, మెడికల్ షాపులను మాత్ర మే తెరిచి ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భౌతిక దూరం పాటించాలని పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ విజ్ఞప్తి చేశారు.
రేగోడ్లో కొనసాగుతున్న లాక్డౌన్
రేగోడ్, మే 5 : కరోనా కట్టడిలో భాగంగా మండల కేంద్రంలో లాక్డౌన్ కొనసాగుతున్నది. లాక్డౌన్కు వ్యాపారస్తులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. దీంతో ప్రజలు అవసరాల నిమిత్తం మాత్రమే బయట వస్తున్నారు. ఇలాగే, ప్రజలు సహకరిస్తూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని, వ్యక్తిగత స్వీయ రక్షణ చర్యలను తీసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం సూచించింది.
మంబోజిపల్లిలో సెల్ఫ్ లాక్డౌన్
మెదక్రూరల్, మే 5: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. బుధవారం మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో గ్రామ పంచాయతీలో వ్యా పార, వాణిజ్య సముదాయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచారు. మధ్నాహ్నం 2 గంటల నుంచి అత్యవసర సేవలైన దవాఖానలు, మెడికల్ దుకాణాలు మినహాయించారు.
పెద్దశంకరంపేటలో పూర్తిస్థాయిగా..
పెద్దశంకరంపేట, మే 5 : మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దశంకరంపేట పట్టణంలో బుధవారం నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ నిర్వహించారు. ఉదయం నుంచి వర్తక వాణిజ్య వ్యాపార, కిరాణా దుకాణాలు మూసివేశారు. పూర్తిస్థాయి లాక్డౌన్ విధించడంతో పెద్దశంకరంపేట నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారితో పాటు పట్టణ ప్రధాన వీధులన్నీ ప్రజలు ఎవ్వరూ బయట బయట రాకపోవడంతో రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి.