సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను : సోలిపేట సుజాత

సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించినందుకు తమ కుటుంబం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుందన్నారు. రామలింగారెడ్డికి అవకాశం ఇచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు తనకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. పెండ్లి పెద్దగా ఉండి ఆనాడు సీఎం కేసీఆర్ తమ పెండ్లి చేశారని, అదేవిధంగా మా పిల్లలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పెండ్లిలు జరిగాయని ఈ సందర్భంగా సుజాత గుర్తుచేశారు. రామలింగారెడ్డి మృతితో ధైర్యాన్ని కోల్పోయిన తమకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు గ్రామానికి వచ్చి ధైర్యాన్ని నింపారని ఈ సందర్భంగా సుజాత భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మంత్రి హరీశ్రావు కండ్లలో నుంచి కన్నీరు పొంగుకు వచ్చింది. మంత్రి తన కన్నీళ్లు తుడుచుకుంటూ...ఆమెను ఓదార్చారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు