రామాయంపేట, మే 5 : ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామ శివారులో బుధవారం కుమ్మరి కుంటలో చోటు చేసుకున్నది. రామాయంపేట ఎస్సై రాజేశ్ వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన కొటిడి నవీన్ (11), కొటిడి నరేశ్(13) అన్నదమ్ముళ్ల పిల్లలు. ఎప్పటిలాగే కుమ్మరి కుంటలోకి ఈత కోసం వెళ్లారు. కుంటలో జేసీబీ గుంతలు ఉండటంతో నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఉదయం వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం కూడా ఇంటికి రాకపోవడంతో కుమ్మరికుంటలోకి వెళ్లగా అక్కడ చిన్నారుల బట్టలు, చెప్పులు కనిపించినట్లు తెలిపారు. వెంటనే గ్రామానికి చెందిన మత్స్యకారులు కుంటలోకి దిగి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెం దిన చిన్నారులు ఇద్దరు మృత్యువాత పడడంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నది. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతదేహాలను రామాయంపేట ప్రభు త్వ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.