సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వేములవాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ సమీపంలో రాజీవ్ రహదారిపై జగదేవ్పూర్ వైపు మళ్లుతున్న కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.